Subscribe

RSS Feed (xml)

మరోసారి అలా జరిగితే భారత్-పాక్‌ల మధ్య యుద్ధమే!

‘26/11’ తరహాలో మరోసారి జరిగితే భారత్-పాకిస్థాన్‌ల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని వాషింగ్టన్‌కు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ వెల్లడించింది. ముంబయి తరహా దాడులు పునరావృతం కాకుండా అరికట్టడం అమెరికా విదేశాంగ విధానానికి అతిపెద్ద సవాల్ అని ఆ సంస్థ తమ నివేదికలో పేర్కొంది.

పీటర్ బెర్జన్, బ్రూస్ హోఫ్‌మన్ ఆధ్వర్యంలో తయారైన ‘ఉగ్రవాద ముప్పుపై అంచనా’ అనే నివేదికలో ముంబయి దాడుల తరహా మరో దాడి జరిగిన పక్షంలో అది భారత ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి తీవ్ర చర్యకు కారణం కావచ్చని ఆ పరిశోధన సంస్థ తెలిపింది.

ఇంకా వందలాది ప్రాణాలను బలిగొన్న 26/11 దాడులు పునరావృతం కాకుండా చూడటమే బైపార్టిషన్ పాలసీ సెంటర్‌కు చెందిన జాతీయ భద్రతా సన్నాహక విభాగం తమ 42 పేజీల నివేదికలో పేర్కొంది.

0 comments:

Related Posts with Thumbnails