ముస్లిం వివాహ సంప్రదాయాల ముసుగులో మోసాలకు పాల్పడుతున్నవారిని నిలువరించడానకి పాకిస్తాన్లో మరో వివాహ చట్టాన్ని తేవాలన్న అభిప్రాయాన్ని పాక్ మాజీప్రధాని, పీఎంఎల్ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ తోసిపుచ్చారు.
శనివారం రంజాన్ పండుగ సందర్భంగా ఆయన పాకిస్తాన్లోని పలు ప్రాంతాలను సందర్శించారు. వరద తాకిడితో నిరాశ్రయులైన ప్రజలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వీట్లు, దుస్తులు, బహుమతులను పంచిపెట్టారు.
ప్రభుత్వం పలు రంగాల్లో పూర్తిగా విఫలమవడాన్ని ప్రజాస్వామ్యం విఫలమైనట్లుగా అభివర్ణించడం తగదని ఆయన అన్నారు. అయితే వరద బాధితులకు సత్వర సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందిన్నారు.
No comments:
Post a Comment